-
దశావతారాలు
[align=center]
[/align]
[size=medium]విష్ణువు యొక్క పది అత్యంత ప్రసిద్ధ అవరోహణాలను సమిష్టిగా “దశావతారాలు” (సంస్కృతంలో ‘దస’ అంటే పది) అని అంటారు. ఈ జాబితా గరుడ పురాణంలో (1.86.10 "11) చేర్చారు, మరియు మానవ సమాజంలో వాటి ప్రభావపరంగా ప్రాముఖ్యతను ఈ అవతారాలు సూచిస్తాయి. మొదటి నాలుగు అవతారాలు సత్య యుగoలో (హిందూ మతంలో వర్ణించబడిన సమయ చక్రంలోని నాలుగు యుగాలలో మొదటిది.) కనిపించాయి అని చెప్పబడింది. తదుపరి మూడు అవతారాలు, త్రేతా యుగo లో, ఎనిమిదో అవతారం ద్వాపర యుగoలో మరియు తొమ్మిదవ అవతారం కలి యుగoలో. పదవది కొన్ని 4,27,000 సంవత్సరాల కాలంలో లేదా కలియుగాంతం లో కనిపిస్తుందని అంచనా.
------------
* మత్స్య అవతారం లేదా చేప సత్య యుగoలో కనిపించింది.
* కూర్మావతారము లేదా తాబేలు, సత్య యుగoలో కనిపించింది.
* వరాహ అనగా పంది, సత్య యుగo లో కనిపించింది.
* నరసింహ అవతారం, సగం మనిషి/సగం మృగం సత్య యుగoలో కనిపించింది.
* వామన అవతారం త్రేతా యుగoలో కనిపించింది.
* పరశురామ అనగా గొడ్డలితో రాముడు, త్రేతా యుగoలో కనిపించాడు.
* రామచంద్ర, లేదా అయోధ్య రాజు, త్రేతా యుగంలో దర్సనమిచ్చారు.
* కృష్ణ ("ముదురు రంగు" లేదా "అన్ని ఆకర్షణీయమైన" అని అర్ధం) అతని సోదరుడు బలరాముడుతో పాటు ద్వాపర యుగంలో కనిపించాడు. భాగవత పురాణము ప్రకారం బలరాముడు అనంత శేషుడు యొక్క వారసత్వం అని చెబుతారు.
* గౌతమ బుద్ధుడు ("జ్ఞాని") కలియుగమునందు అవతరించాడు.
* కల్కి ("శాశ్వతం" లేదా "సమయం", లేదా “వినాశనము కావించు వాడు"), కలియుగాంతం లేదా సంవత్సరం 4,28,899 CE నందు అవతరిస్తాడు అని చెప్పబడింది.
------------
[size=large]మత్స్య అవతారం యొక్క కథ[/size]
మత్స్య అవతారoలో, విష్ణువు చేప రూపంలో దర్శనమిచ్చాడు. సత్య యుగం యొక్క ప్రారంభ సమయంలో, మను అనే ఒక రాజు వేల సంవత్సరాలుగా తపస్సు చేసాడు. ఒక రోజు నదిలో ఒక చిన్న చేప తన చేతుల్లోకి వచ్చినది. ఆ చేప రాజు యొక్క శరణు కోరగా, దాని అభ్యర్థనను అనుసరించి రాజు చేపను ఒక కూజ లో పొందుపరిచెను. కాని చేప రోజు రోజుకి పెరగడం ప్రారంభించింది. అప్పుడు ఆ రాజు ఆ చెప్పాను నదిలో విసిరివేసాడు. కాని ఆ చేప ఇంకా పెద్దగ అవడంతో, గంగా నది యందు మరియు తర్వాత సముద్రంలోకి విసిరారు. అంతట రాజు, ఆ చేప విష్ణువు అని గ్రహించగా దేవుడు ప్రత్యక్షం అయ్యి రాజుకు ఒక ప్రత్యేక అభ్యర్దన గావించాడు. మరో ఏడు రోజుల్లో భారీ వరద ద్వారా ముగింపు సంభవమని చెప్పి, భారీ పడవ నిర్మించమని రాజుకు హితబోధ చేసెను. ఆ పడవలో ఏడుగురు ఋషులు (సన్యాసులు), అన్ని మొక్కల గింజలు, ప్రతి రకం జంతువు ఒకటి తీసుకోవాలని రాజును అభ్యర్థించెను. తాను ఒక చేప రూపంలో వచ్చి ఆ పడవను హిమవన్ కొండకు నడిపిస్తాను అని చెప్పెను. విష్ణువు చెప్పినట్టుగా రాజు ఒక పడవను నిర్మించి అందులో ఏడు ఋషులతో సహా జంతువులను మరియు అన్ని మొక్కల గింజలను పొందుపరిచెను. మహావిష్ణువు చెప్పినట్లు ఏడు రోజుల తరువాత ఒక వరద వచిసంభావించెను. అంతట మహావిష్ణు ఒక చేప రూపంలో అవతరించగా,పాము వాసుకిని ఉపయోగించి చేపను పడవకు ముడిపెట్టెను. వరద తగ్గేంతవరకూ హిమవన్ కొండ యందు వాటిని భద్రముగ వుంచి కొత్త శకం ఆరంభం వరకు అక్కడే ఉంచెను.
[size=large]కూర్మ అవతారం యొక్క కథ[/size]
కూర్మ అవతారంలో, మహావిష్ణువు తాబేలు రూపంలో దర్శనం ఇచ్చాడు. ఇది దేవతలు మరియు అసురులు (రాక్షసులు) పాల్గొన్న ఒక ఆసక్తికరమైన కథ. దేవతలు మరియు అసురుల మధ్య యుద్ధం కొనసాగుతున్న తరుణంలో, ఒక సందర్భంలో దేవతలు తక్కువ నిగ్రహం అంశతో వున్న దుర్వాసుని శాపం కారణంగా వారి బలం కోల్పోయారు. అంతట దేవతలు సహాయం కోసం మహా విష్ణువును సంప్రదించారు. అప్పుడు విష్ణువు పాల మహాసముద్రాన్ని చిలకమని సూచించెను. మందర పర్వతమును వుపయోగించి అసురుల సహాయముతో పాల సముద్రమును చిలకమని సూచించెను. ఈ చిలకము ద్వారా లభించు అమరత్వం యొక్క మధువును సమానంగా పంచుతామని దేవతలు అసురులకు చెప్పిరి. అంతట దేవతలు మరియు అసురులు పాము వాసుకిని తాడు లాగ ఉపయోగించి పాల సముద్రం చిలికెను. దేవతలు వాసుకి యొక్క తలవైపు కోరారు. కానీ దీని వెనుక ఏమైనా కుతంత్రం దాగివుందేమో అని అనుమానoతో అసురులు వాసుకి తలవైపు కోరారు. అంతట, దేవతలు తోక పట్టుకొని చిలకటం ప్రారంభించారు. అసురులు వాసుకి యొక్క విషం వలన నెమ్మదిగా బలహీనపడ సాగారు. ఈ తరుణంలో పర్వతo మునిగిపోవసాగింది. అంతట విష్ణువు కూర్మ రూపాన్ని ధరించి పర్వతాన్ని మోసెను. అమృతభాండం ప్రత్యక్షం అవగానే అసురులు దానిని అపహరించెను. అప్పుడు విష్ణువు ఒక అప్సర రూపాన్ని ధరించి అసురులను ఆకర్షించెను. తాను అమృతము అందరికి సమానముగా పంచేదనని తెలియజేసి ఆ అమృతమును దేవతలకు మాత్రమె పంచి అద్రుస్యమయ్యను. ఈ విధముగా అసురులు మోసగింపబడి పూర్తిగా బలహీనులయ్యిరి.
[size=large]వరాహ అవతారం యొక్క కథ[/size]
వరాహ అవతారoలో, విష్ణువు పంది రూపం లో అవతరించి భూమిని కాపాడుతాడు. హిరణ్యాక్ష అను రాక్షసుడు బ్రహ్మను ప్రార్దించి అమరత్వం కోరగా, బ్రహ్మ అది సాధ్యం కాదనగ, మృగం లేదా మనిషి లేదా దేవుడు కాని తనను చంపజాలరు అని వరం పొందాడు. కానీ ఆ జంతువుల జాబితాలో పంది యొక్క పేరు లేదు. కాని ఒక పంది తనను ఏమి చెయ్యలేదు అని హిరణ్యాక్షుడు భావించి ప్రపంచాలను దోపిడీ చెయ్యటం ప్రారంభించాడు. భూమిని పాతాళ లోకానికి అనగా సముద్రం కిందకు చేరవేసెను. బ్రహ్మ నిద్రలో వ్వుండగా దగ్గర నుండి అతను పవిత్ర గ్రంథాలను దొంగిలించాడు. వేదాలను తిరిగి పొందుటకు మరియు ప్రపంచాన్ని కాపాడేందుకు విష్ణువు ఒక పంది రూపం ధరించి భూమిని తన దంతాలను ఉపయోగించి, మహాసముద్రం కింద నుండి వేలికితీసేను. తర్వాత హిరణ్యాక్షుడను అంతం చేసెను. అంతట అసురులనుండి వేదాలు పొంది బ్రహ్మ యొక్క సురక్షిత అదుపులోకి తిరిగి తీసుకువచ్చేను.
మరిన్ని అవతారాలు త్వరలో...
[/size]
-
RE: దశావతారాలు
మిగతా అవతారాల గురించి తెలుసుకోవాలని వుంది 
ఇంతవరకు తెలియజేసినందుకు ధన్యవాదములు !